SKLM: టెక్కలి ఐతం కళాశాలలో ఎన్సీసీ 14వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బ్రహ్మకుమారి సేవా కేంద్రం సోదరి జయలక్ష్మి జ్ఞాన తరగతులు నిర్వహించారు. ఏకాగ్రతతో మెలిగితే ఓర్పు, సహనం, క్రమశిక్షణ అలవడి విజయం సాధిస్తామని ఆమె తెలిపారు. యోగా, రాజయోగ, మానసిక, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇచ్చారు. సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు.