విజయనగరం: పారా బాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని ఆదివారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. మార్చి 6 నుండి 10 వరకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలో జాతీయ స్థాయి పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి జిల్లాకు, రాష్ట్రానికీ మరింత పేరు తేవాలన్నారు.