విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరస్పరం చర్చించుకున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరినొకరు శాలువాతో సత్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.