NLR: బుచ్చి పట్టణంలోని 20 వార్డులలో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో దోమలు విపరీతంగా పెరగడంతో తాము అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. దోమల నివారణకు అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.