KRNL: శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆదివారం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ వేద పండితులు, ఈవో శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ఇరుముడి సమర్పించి, శివదీక్షను విరమించారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.