కోనసీమ: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని ఈవో నాగవరప్రసాద్ తెలిపారు.