ఎన్టీఆర్: విస్సన్నపేటలోని బీజేఆర్ నగర్లో నివాసం ఉంటున్న జొన్నలగడ్డ ఏసురత్నం(54) అనే వ్యక్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురై ఆదివారం మృతి చెందాడు. భవన నిర్మాణ పనికి వెళ్ళి 11కేవీ వైర్ తగిలి కింద పడటంతో పదునైన ఆయుధం(గడ్డపలుగు) గుచ్చుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.