E.G: శ్రీరామ నవమి సందర్భంగా రాజమండ్రి డిపో మేనేజర్ కె. మాధవ్ ఈ నెల 27న రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి నుంచి ప్రతి గంటకు ఒక బస్సు నడుపుతామని , ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.