BPT: ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని అద్దంకి మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కేవీ.శ్రీనివాసరావు కోరారు. ఈ నెల 23వ తేదీ వరకు అద్దంకి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ (నమోదు) ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.