మన్యం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరుతున్నారని జనసేన మండల అధ్యక్షుడు నేరేడుబిల్లి వంశీ తెలిపారు. సోమవారం కురుపాం మేజర్ పంచాయతీ కస్పాగదబ వలసలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా స్థానిక నాయకులు మురళి, రవి, వెంటరమణ తదితరులు పాల్గొన్నారు.