అన్నమయ్య: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం మదనపల్లె పట్టణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం మందు గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం స్థానిక చిత్తూరు బస్టాండు వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.