కృష్ణా: కలిదిండి మండలం పోతుమర్రు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన అనే విధంగా మండల మేజిస్ట్రేట్, అన్ని శాఖల అధికారులు ప్రజల వద్దకే వచ్చారన్నారు. ప్రజలందరూ తమ సమస్యలు వివరించి పరిష్కరించుకోవాలని సూచించారు.