చిత్తూరులోని సీఆర్ రెడ్డి కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ప్రారంభంకానున్నట్లు ఉప గ్రంథాలయాధికారిణి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు, పాటలు చదువు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.