ATP: తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి విస్తృత తనిఖీలు నిర్వహించారు. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డితో కలిసి కడప-అనంతపురం ప్రధాన రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయడంతో పాటు ప్రయాణికుల వివరాలను ఆరా తీశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.