PLD: నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఉన్న HP, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంక్ యజమానులతో మాట్లాడిన ఆమె, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా కొనసాగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.