TPT: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో బిగ్ క్యాంటీన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేసి భక్తులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్. వెంకయ్య చౌదరి ఆదేశించారు. నిర్ణయించిన ధరలకే ఆహారం విక్రయించాలని, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.