PPM: కురుపాం ఎంపీడీవో కార్యాలయాన్ని ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ ఎస్. దిలీప్ చక్రవర్తి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సచివాలయ మండల బృందంతో సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ సర్వేల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.