CTR: వర్షాలు కురిసినప్పుడు పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని పుంగనూరు పశుసంవర్ధక శాఖ AD డాక్టర్ మనోహర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విషసర్పాల నుంచి పశువులను కాపాడుకోవాలని, ఎత్తైన ప్రాంతాలలో వాటిని ఉంచాలన్నారు. జీవాలు, పశువులకు నట్టల నివారణ మందులు, వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తెలిపారు.