సత్యసాయి: లేపాక్షి పంచాయతీ వాహన పార్కింగ్ హక్కుల కోసం గురువారం నిర్వహించిన వేలంపాట ఉత్కంఠగా సాగింది. పోటాపోటీగా జరిగిన ఈ వేలంలో సైఫుల్లా రూ.36.51 లక్షలకు పార్కింగ్ హక్కులను దక్కించుకున్నారు. అలాగే, వారపు సంత వేలాన్ని నయాజ్ రూ.3 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఎంపీడీవో నరసింహులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.