BPT: ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకై కృషిచేసి, అమరణ నిరాహారదీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెరుకుపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ మహబూబ్ సుభానీ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆదివారం చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు.