సత్యసాయి: పుట్టపర్తిలో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను పరిశీలించారు. కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ మాట్లాడుతూ.. దళితుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.