ATP: గుత్తి మండలం నాగసముద్రం క్రాస్ వద్ద సోమవారం ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని జిల్లా కేంద్రానికి తరలించారు. గుత్తి నుంచి అబ్బే దొడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.