E.G: పెరవలి మండలం తీపర్రులో ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. తణుకు డిపోనకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా, అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.