E.G: దేవీపట్నం మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో గొందూరు పోశమ్మ గండి భక్తులకు ధర్మకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం భారీగా భక్తులు రానున్నందున కొండప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. గండి నుంచి పూడిపల్లి దారిని మూసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. పాపికొండల పర్యాటకులు సాయంత్రం లోపే తిరిగి రావాలని, అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని అధికారులు తెలిపారు.