BPT: అమృతలూరు మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ‘మీకోసం’ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వివిధ అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన దిశానిర్దేశాలు ఇచ్చారు.