BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్.టి. యానాది కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికీ తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. శాంతిభద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.