కృష్ణా: అసెంబ్లీలో కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎంపీ,ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడిస్తామని కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ కొండ గురువారం హెచ్చరించారు. ఐదు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మంత్రులు,ఎమ్మెల్యేలు ప్రస్తావించకపోవడం సిగ్గుచేటన్నారు. అక్టోబర్ 15 లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని తెలిపారు.