KDP: జిల్లాలో వినూత్నంగా అమరవుతున్న పథకాల అమలు నిమిత్తం రూ. 7.5 కోట్ల నిధులు నీతి అయోగ్ విడుదల చేసిందని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. అందులో భాగంగా స్టార్ట్ ఆఫ్ కడప, స్మార్ట్ కిచెన్, అంగన్వాడిల్లో మౌలిక వసతులు కల్పన పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని నీతి అయోగ్ కార్యదర్శి శేఖర్కు కలెక్టర్ శ్రీధర్ న్యూఢిల్లీలో వివరించారు.