W.G: మైనర్ బాలికలు, మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద స్పష్టం చేశారు. మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యమని, నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆమె హెచ్చరించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల ఏ మాత్రం రాజీ పడకుండా బాధ్యులపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.