అన్నమయ్య: గత YCP ప్రభుత్వ కాలంలో జరిగిన భూ అక్రమాలు, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని TDP నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. సోమవారం రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల అక్రమాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని సూచించారు.