AKP: అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ పరిధిలో 16 సంఘాలకు, మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి 28 సంఘాలకు, చిన్న తరహా సంఘాలు 256కు ఎన్నికలు నిర్వహించామన్నారు. వీటిలో 281 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు.