ATP: పీఏబీఆర్ డ్యాం నుంచి నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ జల్లిపల్లి వద్ద లీకేజీ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ లీకేజీ మరమ్మతు పనుల దృష్ట్యా బుధవారం సాయంత్రం వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ప్రధాన పైపు లైన్ మరమ్మతు పనులను పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.