కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ చోటు చేసుకున్న బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఐజీపీ అశోక్ కుమార్ నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఘటనకు సంబంధించి వివరాలను స్వయంగా పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.