VSP: బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు ఈనెల 18న స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ధర్నాలో ఉద్యోగుల పాల్గొనాలన్నారు. ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.