ASR: పెన్షనర్స్ ఉద్యమకారుడు డీ.ఎస్.నకరాకు పాడేరులో ఘన నివాళులర్పించారు. 43వ జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా మంగళవారం పాడేరులోని పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఏటీవో నాగభూషణం రాజు, రిటైర్డ్ ఎస్డీసీ టీ.అప్పారావు నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో పెన్షన్స్ సాధనకు నకరా విశేష కృషి చేశారని అన్నారు. పెన్షనర్లకు చిరాస్మరణీయుడని కొనియాడారు.