అన్నమయ్య: మల్లూరు అమ్మ జాతరలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ప్రజా చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్పై అవగాహన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ప్రారంభించి యువతీ యువకులు ఎయిడ్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూరల్ సీఐ రోషన్ మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.