కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆయన రామచంద్రాపురంలో జరిగిన నియోజకవర్గస్థాయి కూటమి నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలలో అధిక శాతం స్థానాలలో కూటమి పార్టీల అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేలా కృషి చేయాలని సూచించారు.