SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నా నాయుడు చొరవతో టెక్కలి రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రానికి రూ.3 కోట్లు, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయానికి రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు దేవాదాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.