అన్నమయ్య: రామపురం మండలంలోని APSWRS, కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన వసతులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.