NDL: సంజామల మండల వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తహాశీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. సంజామల SRBC సాగునీటి సంఘం అధ్యక్షుడిగా తలారి మల్కి హుస్సేని, ఉపాధ్యక్షుడిగా మూరబోయిన శివయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా TDP నేత పెండేకంటి కిరణ్ కుమార్, తహాశీల్దార్ గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారం అందజేశారు.