ప్రకాశం: ఈ నెల 17వ తేదీన జిల్లాలో రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కలెక్టర్ తెలిపిన వివరాల మేరకు.. 16న సాయంత్రం 6 గంటలకు నెల్లూరు నుంచి రోడ్డు మార్గాన అంచనాల కమిటీ ఒంగోలు చేరుకుంటుంది. ఆ తర్వాత 17వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఆర్థిక సంస్థల బడ్జెట్ అంచనాలపై కమిటీ సమీక్షించనుంది.