PLD: వినుకొండలో మంగళవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న నాగరాజుపై గుర్తుతెలియని వ్యక్తులు కారం చల్లి దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.