కృష్ణా: అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అమ్మవారి ఉత్సవాల పోస్టర్లను ధర్మకర్తలు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందించి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.