ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పరిటాల సునీత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన సహచర ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలతో కలిసి ఆయనను కలిసి పలు అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ అంశాలపై చర్చ సాగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను ఇరువురు నేతలు స్వాగతించారు.