కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో శనివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,86,015 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 286 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 11 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు. 2,816 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.