WG: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల ఫీజుల వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆర్.రామిరెడ్డి గురువారం తెలిపారు. ఈ వేలం ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు. సదరు పాటదారులు అందరూ బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.