KDP: తాళ్ల ప్రొద్దుటూరు పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సుగుమంచిపల్లి చెక్పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి 250 క్వార్టర్ బాటిళ్ల కేరళ మాల్ట్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. చామలూరు గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి వద్ద నుంచి మద్యం పట్టుబడగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.