VZM: జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ దామోదర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశ్నాపత్రాలు తరిలించేటప్పుడు, భద్రపరిచేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద 144 సి.ఆర్.పి.సి/163 బిఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందన్నారు.