విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉదయం ఉత్తర్వులు విడుదల చేసింది. హరేంధిర ప్రసాద్ను కాకినాడకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే విశాఖ జిల్లా కలెక్టర్గా ఎమ్.అభిషిక్త్ కిషోర్ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కలెక్టర్ అనేక సంస్కరణలు చేపట్టారని అధికారులు తెలిపారు.