ప్రకాశం: కనిగిరిలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయానికి వచ్చిన మాగుంటను స్థానిక టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎంపీ మాగుంట కనిగిరిలోని వాసవి మాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు భైరవకోన శ్రీ భైరవేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.